సీనియర్ నటి సుధ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘మాతృదేవోభవ’. ఓ అమ్మ కథ అనేది ఉపశీర్షిక. పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్నారు. శ్రీవాసవి మూవీస్ పతాకంపై చోడవరపు వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. కె హరనాథ్ రెడ్డి దర్శకుడు. ఈ నెల 18న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నటి సుధ మాట్లాడుతూ. ఇది నా సినిమా అని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది. ఓ మంచి సందేశంతో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. చిత్రబృందం మనసు పెట్టి పనిచేశారు అని అన్నారు.