‘ప్రభాస్ ‘సలార్’ సినిమా ‘కేజీఎఫ్’కు మించి వుంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి కథ, కథనాలు, యాక్షన్ చూడలేదు. దర్శకుడు ప్రశాంత నీల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లాగా ఓ ప్రపంచాన్ని సృష్టించారు’ అన్నారు నటి శ్రియా రెడ్డి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులతో పాటు ఆడియన్స్లో కూడా భారీ అంచనాలు వున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా, ‘పొగరు’ ఫేమ్ శ్రియా రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ‘సలార్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ‘ ఈ చిత్రం అందరి అంచనాలు అందుకునే స్థాయిని మించి వుంటుంది. ప్రభాస్ను ఇప్పటి వరకు చూడని విధంగా చూడబోతున్నారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతారు. ప్రతి సన్నివేశం కొత్తగా, ఆసక్తికరంగా వుంటుంది. ప్రపంచానికి సీపీఆర్ ఇచ్చే సమయం వచ్చింది. ‘సలార్’ కోసం సిద్ధంగా వుండండి’ అని చెప్పారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.