SSMB28 | త్రివిక్రమ్ సినిమాలలో కామెడీతో పాటు ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమాలను తెరకెక్కిస్తాడు. త్రివిక్రమ్ సినిమాలలో చిన్న క్యారెక్టర్కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన సినిమాలలో నటించడానికి చిన్న అవకాశమస్తే చాలు అనుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. త్రివిక్రమ్ తన సినిమాలలో లీడ్ యాక్టర్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోను శ్రద్ధ తీసుకుంటాడు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఇందులో మరో స్టార్ హీరోయిన్ను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
మహేష్బాబు త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా క్లాసిక్స్గా నిలిచాయి. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా శాటీలైట్ పరంగా బ్లాక్బస్టర్ హిట్స్ అయ్యాయి. 11ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్ కావడంతో త్రివిక్రమ్ ఈ సారి ఎలాగైన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. అందుకే ఈ చిత్రంలో నటినటుల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదట. తాజాగా ఈ చిత్రంలో మహేష్బాబుకు పిన్నిగా ప్రముఖ సీనియర్ నటి శోభనను ఎంపికచేయాలని భావిస్తున్నాడట. మేకర్స్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారని సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.