తెలుగు చిత్రసీమలో మరో మలయాళీ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు సమాచారం. ‘భీమ్లానాయక్’ చిత్రం ద్వారా సంయుక్తమీనన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. పవన్కల్యాణ్, రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లానాయక్’. అహంభావ మనస్తత్వమున్న ఓ పోలీస్ ఆఫీసర్కు, రిటైర్డ్ ఆర్మీ అధికారికి మధ్య ఏర్పడిన వైరం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథాంశంతో దర్శకుడు సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్కల్యాణ్ జోడీగా నిత్యామీనన్ నటిస్తున్నది. రానా సరసన నటించే నాయిక కోసం చిత్రబృందం చాలా రోజులుగా అన్వేషణ సాగిస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ సొగసరి సంయుక్తమీనన్ను ఎంపికచేశారని సమాచారం. తొలుత ఈ పాత్రకు ఐశ్వర్యరాజేష్ పేరు వినిపించింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె నటించలేకపోయింది. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ప్లేను అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.