ఇబ్బందికర కామెంట్లు పెడుతున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది స్టార్ హీరోయిన్ సమంత. హీరో నాగచైతన్యకు మరో ప్రముఖ తారకు మధ్య లవ్ స్టోరి సాగుతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వార్తలను వ్యాప్తి చేయడంలో సమంత పీఆర్ టీమ్ పనిచేస్తున్నదని నాగ చైతన్య అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమంత స్పందించింది. ‘ఒక అమ్మాయిపై పుకార్లు వస్తే అవి ఖచ్చితంగా నిజమే అయి ఉంటాయి అనుకుంటారు, అదే అబ్బాయిపై రూమర్స్ వస్తే వాటిని అమ్మాయి చేయిస్తోంది అని చెబుతారు. పుకార్లు వచ్చిన వాళ్లు బాగానే ఉన్నారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు, మీరూ మీ పని చేసుకోండి, మీ కెరీర్, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నది.