మరోసారి యువ హీరో సరసన నటించేందుకు సిద్ధమవుతున్నది నాయిక సమంత. ఇటీవల ‘శాకుంతలం’ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్కు జంటగా ఈ తార కనిపించింది. త్వరలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో సమంత కలిసి నటించబోతున్నది అనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ‘డీజే టిల్లు’ సినిమా విజయంతో సిద్ధుకు యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది.
వినూత్నమైన ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను దర్శకురాలు నందినిరెడ్డి రూపొందిస్తారని తెలుస్తున్నది. ఈ సినిమా కథా కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నది. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక ఆమె బాలీవుడ్లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్తో పాటు తమిళ, ఇంగ్లీష్ భాషల్లో ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాలో కనిపించనుంది.