Sai Pallavi | రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితేష్ తివారి దర్శకత్వంలో పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి సీత పాత్రలో నటించనుంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముంబయిలో వేసిన అయోధ్య సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
జూలైలో ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నది సాయిపల్లవి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సాయిపల్లవి 15 కోట్ల భారీ పారితోషికం తీసుకోనున్నట్లు తెలిసింది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఒక్కో భాగానికి సాయిపల్లవి ఐదు కోట్ల రెమ్యునరేషన్ను స్వీకరించనుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సాయిపల్లవి భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు.