Radhe Shyam | మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘రాధేశ్యామ్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రనుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్లు ఇలా ప్రతి ఒక్కటి సినిమా పైన అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. లేటెస్ట్గా ఈ చిత్ర తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన హీరోయిన్ రిద్దీ కుమార్ రాధేశ్యామ్ గురించి పలు విషయాలను వెల్లడించింది.
‘రాధేశ్యామ్’ చిత్రంలో స్పోర్ట్స్ ఉమెన్ క్యారెక్టర్ చేశానని, ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్చరీ నేర్చకున్నానని చెప్పింది. ఈ చిత్రంలో నటనకు ప్రధాన్యం ఉన్న పాత్రను చేశానని, ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదరుచూస్తున్నట్లు వెల్లడించింది. తెలుగులో అల్లుఅర్జున్,తారక్, విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉంది అంటూ మనసులో మాటను తెలిపింది. మేకర్స్ విడుదల చేసిన సెకండ్ ట్రైలర్లో ఈమె చేతిని చూసి స్పోర్ట్స్ వద్దూ అంటూ ప్రభాస్ చెప్పాడు. గతంలో ఈమె రాజ్తరుణ్ నటించిన ‘లవర్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. రాధేశ్యామ్ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రభాస్కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.