‘గీత’గా హీరోకు చుక్కలు చూపించింది. ‘లిల్లీ’గా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. ‘శ్రీవల్లి’గా దేశవ్యాప్తంగా అభిమానులను అలరించి క్రష్మికగా కీర్తి గడించింది రష్మికా మందన్న. తను వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఊపేస్తున్నది. ఆమె నటించిన సినిమాలు ఈ ఏడాది ఏకంగా నాలుగు విడుదల అవుతున్నాయంటే రష్మిక ఎంత బిజీగా ఉందో అంచనా వేయొచ్చు. తాజాగా, ఈ కన్నడ కస్తూరి నటించిన బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ విడుదలైంది. ఈ సందర్భంగా రష్మిక చిట్చాట్..