Rashikanna | నటన ప్రధాన్యమున్న కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ రాశీఖన్నా. 2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే వరుస సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. బుధవారంతో ఈమె టాలీవుడ్ ప్రస్థానానికి 8 ఏళ్ళు. ఈ ఎనిమిదేళ్ళలో ఇప్పటివరకు రాశి 20సినిమాల వరకు నటించింది. అయితే జూ.ఎన్టీఆర్తో తప్పితే మరో స్టార్ హీరో సినిమాలో నటించలేదు. కేవలం టైర్2 హీరోలతోనే సరిపెట్టుకుంది. అయితే ఈమెకు కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయిట. కానీ కొన్నికారణాల వల్ల వాటి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాశీ ఖన్నా మిస్ చేసుకున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం
సర్కారు వారి పాట:
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా పరుశురాం మొదట రాశీఖన్నాని అనుకున్నాడట. కానీ నిర్మాతలు పెద్ద హీరోయిన్ అయితే బావుంటందని భావించి కీర్తిని ఎంపిక చేశారట. ఇలా నోటీ దాకా వచ్చిన ముద్ద జారి కిందపడ్టట్లు రాశీఖన్నాకు మహేష్తో అవకాశం వచ్చి పోయింది.
మానాడు:
శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్లో మంచి వసూళ్ళను సాధించింది. చాలా కాలం తర్వాత శింబు ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రంలో మొదట రాశీఖన్నాను హీరోయిన్గా సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆఫర్ కళ్యాణీ ప్రియదర్శన్కి వెళ్ళింది.
టక్ జగదీష్:
నాని హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో హీరోయిన్గా మొదట రాశీఖన్నాను సంప్రదించారట. కానీ హీరోయిన్ పాత్రలకు అంతగా స్కోప్ లేకపోవడంతో ఈ ఆఫర్ను రాశీ తిరస్కరించిందట.
ఎఫ్2:
వరుణ్తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.
అయితే ఈ చిత్రంలోని హనీ పాత్ర కోసం అనీల్రావిపూడి మొదట రాశీని సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల నో చెప్పిందంట. దాంతో మెహరీన్కు దగ్గరకు ఈ పాత్ర వెళ్ళింది.
గీతాగోవిందం:
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం సెన్సేషన్ హిట్ను సాధించింది. ఈ చిత్రం నిర్మాతలకు 5రేట్లు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో విజయ్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. హీరోకు సమానంగా రష్మికకు కూడా ఈ చిత్రంతో మంచి క్రేజ్ వచ్చింది. చెప్పలాంటే ఈ సినిమా రష్మిక లైఫ్నే మార్చేసింది. అయితే ఈ పాత్ర కోసం మేకర్స్ మొదట రాశీకన్నాను సంప్రదించారట. అయితే అప్పటికి విజయ్కు టాలీవుడ్లో అంత క్రేజ్ లేదు. అర్జున్ రెడ్డి అప్పటికి ఇంకా విడుదల కాలేదు. దాంతో రాశీ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదు. ఈ సినిమా గనుక రాశీ చేసుంటే తన లైఫ్ మరోలా ఉండేదని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవే కాకుండా రాశీ చాలా వరకు సినిమలను వదులుకుందట. కొన్ని కథలు నచ్చక వదులు కుంటే మరికొన్ని కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలనున్నాయి. టాలీవుడ్లో రెండు ఈమె నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.