‘బిజ్లీ బిజ్లీ..’ మ్యూజిక్ వీడియోతో పాపులారిటీ తెచ్చుకుంది యువ తార పాలక్ తివారీ. నటి శ్వేతా తివారీ కూతురైన ఈ భామ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఈ క్రేజ్తో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నదీ నాయిక. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు హైదరాబాద్లోనూ జరుగుతున్నది. పాలక్ తివారీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇక్కడి ఫుడ్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడింది. ఆమె స్పందిస్తూ…‘హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందని విన్నా. అలాగే ఇక్కడి బిర్యానీ వరల్డ్ ఫేమస్. అయితే ఎప్పుడు తినే అవకాశం రాలేదు. నేను డైటింగ్ చేస్తున్నందున కనీసం వెజ్ బిర్యానీ అయినా రుచి చూడాలి. ఇక మా చిత్రబృందం కోసం కావాల్సినంత బిర్యానీ ఆర్డర్ పెట్టా. తెలుగు సినిమాలు చూశాక ఎందుకు అవి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాయో అర్థమైంది. అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ నా ఫేవరేట్ హీరోలు. టాలీవుడ్లో నటించే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా’ అని చెప్పింది.