Nithya Menen | పుష్కర కాలం క్రితం వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. ‘భీమ్లానాయక్’, ‘తిరు’ సినిమాలతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్లోకి వచ్చేసింది. ఇటీవలే వచ్చిన కుమారి శ్రీమతితో ఓటీటీలోనూ అదరగొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి విషయంలో తనకు స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయని, పెళ్లి అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్ అని చెప్పింది. తనకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదని, ఎవరైనా దానికి మించి ఆలోచించేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ రిలీజై మంచి ఆధరణ దక్కించుకుంది. ప్రైమ్లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వెబ్ సిరీస్కు వచ్చిన రెస్పాన్స్ చూసి నిత్యా మాస్టర్ పీస్ అనే మరో వెబ్ సిరీస్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటుగా ప్రస్తుతం నిత్యా లైనప్లో రెండు సినిమాలున్నాయి.