‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ నా పాత్రను పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యింది’ అన్నారు కథానాయిక నందితా శ్వేత. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘హిడింబ’. అశ్విన్బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
ఈసందర్భంగా చిత్ర బృందం శనివారం థాంక్ యూ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ ‘కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు విజయవంతం చేస్తారనే విషయాన్ని ఈ చిత్ర విజయం మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, థ్రిల్లింగ్ స్క్రీన్ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాత గంగపట్నం శ్రీధర్, చిత్ర దర్శకుడు తదితరులు పాల్గొన్నారు.