దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janhvi Kapoor) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateshwara swamy) దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటి శ్రీదేవికి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఇక తన తల్లిలానే జాన్వీకపూర్కి కూడా తిరుమల అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి ఏడాది ఆమె తిరుమల దర్శనానికి వస్తారు.
#WATCH | Andhra Pradesh | Actress Janhvi Kapoor visits Sri Venkateswara Swami Temple in Tirumala to offer prayers. pic.twitter.com/zbOHYkcBfH
— ANI (@ANI) August 28, 2023
జాన్వీకపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (NTR) సరసన దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా మార్చి 31 ప్రారంభమయింది. జాన్వీకి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని ఇప్పటికే షేర్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతిలోకసుందరి శ్రీదేవి పెద్దకూతురు నటిస్తున్న మొదటి తెలుగు సినిమా అయిన దేవర చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నది.