Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. వీరందరూ ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. అయితే నేడు బెంగళూరులో విచారణ జరుగుతుండగా.. ఈ విచారణకు హేమ డుమ్మా కొట్టింది. తాను వైరల్ ఫీవర్తో భాదపడుతున్నట్లు విచారణకు మరికొంత సమయం ఇవ్వవలసిందిగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులకు లేఖ రాసింది. అయితే ఈ లేఖపై సీసీబీ స్పందిస్తూ.. తాము ఈ లేఖను పరిగణలోకి తీసుకోలేము అని తెలిపింది. హేమకు మరోసారి నోటీసులు పంపనున్నట్లు ప్రకటించింది.
ఇక నోటీసులు అందుకున్న వారిలో హేమతో పాటు కాంతి, సుజాత, రాజశేఖర్, చిరంజీవి, ఆషీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులు ఉన్నారు.