నలుగురు అగ్ర కథానాయికలు ఒక్కచోట చేరి సందడి చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఆదివారం చెన్నైలో ఆ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. టాప్హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్ కలుసుకొని విరామ సమయాల్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. తమ విలువైన సమయాన్ని అందమైన సాయంత్రం కోసం కేటాయించినందుకు త్రిష, కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్కు సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. సుదీర్ఘ విరామం తర్వాత తమ గ్యాంగ్లో సమంత చేరిందంటూ త్రిష ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ నలుగురు నాయికల ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు సమంత ఇటీవలే ‘శాకుంతలం’ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.