Actress Bhoomika Chawla | ఇరవై మూడేళ్ల క్రితం అక్కినేని సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ భామ భూమిక చావ్లా. తొలిసినిమా అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయినా.. రెండవ సినిమాకే ఏకంగా పవన్తో ‘ఖుషీ’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భూమికకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్గా మారింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాదిన తెగ బిజీగా గడిపింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోనూ భూమిక వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా భూమిక కీలకపాత్రలో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది.
‘తేరే నామ్’ తర్వాత దాదాపు 20ఏళ్లకు సల్మాన్, భూమిక చావ్లా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాతో భూమికకు హిందీలో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఆమెకు అవకాశాలు కూడా భారీగా వచ్చాయి. కాగా తాజాగా ఈ అమ్మడు ఆమె సంతకం చేసిన సినిమాల నుంచి కూడా తనను తీసేసారని సంచలన విషయాలను చెప్పుకొచ్చింది. షాహిద్ కపూర్, కరీనా కపూర్ల ‘జబ్ వీ మెట్’ సినిమాలో ముందుగా తననే ఎంపిక చేశారని భూమిక చెప్పింది. ముందుగా ఈ సినిమాకు ట్రైన్ అనే టైటిల్ను పెట్టారని, హీరోగా బాబీ డియోల్ను అనుకున్నారని చెప్పింది. అయితే నిర్మాణ సంస్థ మారడంతో ఆ ప్రాజెక్ట్లోకి కరీనా కపూర్, షాహిద్ కపూర్ వచ్చారని చెప్పింది. అప్పుడు తనకు చాలా బాధగా అనిపించిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఇదే కాకుండా ‘మున్నాభాయ్ MBBS’ సినిమాకు కూడా సంతకం చేశానని చెప్పింది. కానీ చివరకు గ్రేస్ సింగ్ను హీరోయిన్గా నటింపజేశారు. తనను తీసేయడానికి గల కారణాలు కూడా రాజ్కుమార్ హిరానీ ఓ సారి చెప్పాడని భూమిక వెల్లడించింది. ఎవరో చేసిన తప్పు కారణంగా మిమ్మల్ని సినిమా నుంచి తొలిగింప చేయాల్సి వచ్చిందని తెలిపింది. వీటితో పాటుగా మణిరత్నం అమృతం సినిమాలో కూడా ముందుగా తననే ఎంపిక చేశారని ఈ ఢిల్లీ బ్యూటీ చెప్పుకొచంచింది.