Actor Vishal | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. గురువారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు.
అయితే భవతరణి మృతి పట్ల కోలీవుడ్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆమెకు సంతాపంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ”నేను అభిమానించే ప్రియమైన భవతరణి. నీ మరణ వార్త విని నా హృదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావ్. నేను నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ శంకర్ రాజా సోదరిగా, వాసుకి కజిన్గా కంటే ఎక్కువగా నా స్వంత చెల్లెలిగా మిస్ అవుతున్నాను. నువ్వు మమ్మల్ని ఇంత త్వరగా విడిచిపెట్టి పోతావనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో అర్థం కావట్లేదు. ఈ పరిణామాలు జీవిత రూపకల్పనను తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ విశాల్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Dear Bavatha. I write this with a heavy heart and unable to digest it. Am really sorry you are not going to be with us anymore and left us to be with the gods. I miss u as a sister, as my own, more than I knew you as Ilayaraja sir’s daughter or Yuvan’s sister or Vasuki’s cousin.…
— Vishal (@VishalKOfficial) January 26, 2024
ఇళయరాజా కూతురు భవతరిణికి గాయనిగా కోలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. ఆ సినిమాలో మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గానూ పనిచేసింది. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.