హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ప్రస్తుతం శంకర్పల్లి మండలం మోకిళ్లలోని నివాసంలో ఉన్న తారకరత్న భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఫిల్మ్ఛాంబర్కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలింఛాంబర్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తారకరత్నకు అభిమానులతోపాటు సినీప్రముఖులు నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర సాగనుంది. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నందమూరి తారకరత్న బెంగళూరులోని దవాఖానలో ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని అక్కడి నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.