మానసిక ప్రశాంతతతో పాటు మనోబలాన్ని ప్రోదిచేసుకోవడానికి ఆధ్యాత్మిక యాత్రలు ఉపకరిస్తాయి. నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు కూడా తమ పనులకు కాస్త బ్రేక్నిచ్చి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు తరలివెళ్తుంటారు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే ఇటీవలే వారణాసిని సందర్శించింది. పవిత్రగంగా తీరంలో ఒక్కరోజు గడపడం హృదయానికి సాంత్వన చేకూర్చిందని చెప్పిందామె. గంగాహారతిలో పాల్గొనడం దివ్యమైన అనుభవమని పేర్కొంది. ‘నా సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయాన్ని కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నా. అందరికి శుభం కలగాలని కోరుకున్నా’ అని పూజాహెగ్డే చెప్పింది.