ఈ రోజుల్లో సినిమా తీసిన తర్వాత దాని ప్రమోషన్స్ ఎంత కొత్తగా చేస్తున్నాం అనేది కీలకంగా మారిపోయింది. అందుకే ప్రమోషన్స్ కోసం కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. అందులోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రంగ్ దే టీం కూడా ఇదే చేస్తున్నారు.
నిన్నమొన్నటి వరకు కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో అస్సలు వేగం కనిపించలేదు. నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తున్నాడు. మార్చి 26న సినిమా విడుదల కానుంది. తమ సినిమా ప్రమోషన్స్పై తామే సెటైర్ వేసుకుని ప్రమోషన్ మొదలు పెట్టారు నితిన్ అండ్ కో. వారం రోజులు కూడా లేదు.. ఇంకెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు అంటూ నితిన్కు కమెడియన్స్ సుహాస్, అభినవ్ ఫోన్ చేస్తారు. అక్కడ్నుంచి ఇది మొదలైంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు కీర్తి సురేష్ ను కూడా చాలా తెలివిగా సినిమా ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే నితిన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారిందిప్పుడు.
ఈ అమ్మాయి కనిపించడం లేదు అంటూ కీర్తి సురేష్ ఫోటో ట్వీట్ చేసాడు నితిన్. దానికింద డియర్ అను.. నువ్వు ఎక్కడున్నా వెంటనే రంగ్ దే ప్రమోషన్స్ లో జాయిన్ కావాలని కోరుకుంటున్నా.. ఇట్లు నీ అర్జున్ అంటూ పోస్ట్ చేసాడు. అది కాస్తా వైరల్ అయింది. అక్కడితో ఆగిపోలేదు ఈ ప్రమోషన్.. అగ్నికి ఆయువు తోడైనట్లు ఈ ట్వీట్ కు హైదరాబాద్ పోలీసులు కూడా రిప్లై ఇచ్చారు. మీరేం కంగారు పడకండి నితిన్.. మేం చూసుకుంటాం అంటూ రిప్లై ఇచ్చారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.