Nandamuri Tarakaratna | నేడు కుప్పం నియోజక వర్గ కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యపరిస్థితి గురించి ఆయన బాబాయి, సినీ నటుడు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
‘తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యింది. మిగితా రిపోర్టులు అన్నీ బాగున్నాయి. డాక్టర్లు చాలా బాగా చికిత్సనందిస్తున్నారు. తారకరత్న బీపీని అదుపులో ఉంచుతూ చికిత్సనందిస్తున్నారు. డాక్టర్లు ప్రాథమికంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.
మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్తే బాగుంటుందని సూచించారు. డాక్టర్ల సూచనతో తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పటికపుడు వివరాలు అడిగి తెలుసుకుంటురన్నారని’ బాలకృష్ణ చెప్పారు.