యాక్షన్కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకుడు. ఫాతిమా నిర్మాత. ఈ నెల 18న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత సమీర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అర్జున్, జేడీ చక్రవర్తి పోటీపడి నటించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కించాం. రాధిక కుమారస్వామి, సోనీచరిష్టా కథానాయికలుగా నటించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్గారు నటించిన చివరి సినిమా ఇది. ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, దర్శకుడు: ఎస్.ఎస్.సమీర్.