Rajinikanth | ఏడు పదుల వయసు దాటినా యంగ్ హీరోలకు మల్లే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం రజనీ నటించిన జైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఓ రేంజ్లో అంచనాలు నెలకొల్పింది. అగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దీనితో పాటుగా కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ మోయిదీన్ భాయ్గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రజనీ, కే.ఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఫేక్ ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా రిటైర్ అయిన పోలీసుల పోరాటల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. కే.ఈ జ్ఞానవేల్ రాజా తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాను ఇంటెన్సీవ్ డ్రామాగా రూపొందించనున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోకు సమానంగా విలన్ రోల్ ఉండనుందట. దాంతో ఆ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను సంప్రదించారట. కథ నచ్చడంతో అర్జున్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అర్జున్ కు ముందు ఈ పాత్ర కోసం విక్రమ్ ను సంప్రదించారట. అయితే విలన్ గా చేసేందుకు విక్రమ్ అంగీకరించలేడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.