కొరాటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ఆచార్య. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిది పడింది. ఈ చిత్రం . ఈ సినిమాను మొదట దసరా అన్నారు.. ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఉంటుందని టాక్ నడిచింది. మొత్తానికి ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్… సిద్దా అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే(pooja hegde) నీలాంబరి అనే పాత్రలో నటిస్తుంది.
ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేయగా, ఇప్పుడు ఇద్దరి మీద చిత్రీకరించిన సాంగ్ విడుదలకి టైం ఫిక్స్ చేశారు. నవంబర్ 5న ఉదయం 11.07ని.లకు నీలాంబరి అనే సాంగ్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన లాహె లాహె పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది.ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.