సైరా నరసింహరెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ స్టార్ట్ చేయడం.. చరణ్ RRR చిత్రీకరణలో బిజీగా ఉండటంతో రెండు పాటలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు వీటిని తిరిగి మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ శివార్లలో ఆచార్య కోసం ప్రత్యేకమైన సెట్ రూపొందించగా,ఇందులో చరణ్- చిరులపై కొరటాల ఓ సాంగ్ని చిత్రీకరించబోతున్నాడట. ఇది మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుందని అంటున్నారు. చిత్రానికి సంబంధించిన మరో పాట చరణ్ – హీరోయిన్ పూజా హెగ్డే లపై చిత్రీకరించనున్నారు.ఇది వచ్చే వారం జరగనుందని సమాచారం.
సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తుండగా, థియేటర్స్ సమస్యపై క్లారిటీ వచ్చాక ఆచార్య చిత్ర రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.