Acharya Ticket Prices | టాలీవుడ్ మెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్చరణ్ మల్టీస్టారర్గా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపైన అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటూ ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్ను తిప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునే అనుమతిని ఇచ్చింది. ఏప్రిల్ 29నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే వెసలు బాటును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా ప్రకటించింది. అయితే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ వంటి వ్యత్యాసం లేకుండా ఏపీ ప్రభుత్వం పదిరోజుల పాటు ఒక్కో టికెట్పై రూ.50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఆచార్య షూటింగ్ను మారెడు మిల్లి అడవిల్లో కొంత వరకు షూటింగ్ జరిపారు. కాగా ఏపిలో చిత్రీకరణ చేయడం, నిర్మాణ వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది.
ఇక తాజాగా సోమవారం రోజు నైజాంలో కూడా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వారం రోజులు అంటే ఏప్రిల్29 నుంచి మే5 వరకు ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్లో రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 వరకు పెంచుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా వారం రోజుల పాటు ఐదో ఆటకు కూడా పర్మిషన్ ఇచ్చింది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మ్యట్నీ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రామ్చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.