సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను దవాఖానకు తరలించడం.. పోలీసుల దర్యాప్తు ఈ వార్త తెలుగు నాట వైరల్ కావడం వెనువెంటనే జరిగిపోయింది. అయితే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడివున్న సాయి తేజ్ను గమనించి అతనిని లేపి అంబులెన్స్కు ఫోన్ చేసిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అతని పేరు అబ్దుల్ ఫర్హాన్. నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో వ్యాలెట్ పార్కింగ్లో పనిచేస్తున్న అబ్దుల్ ఈ ప్రమాదం గురించి ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాం..