Aarambham Movie | C/O కంచరపాలెం (c/o kancharapalem) సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు మోహన్భగత్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘ఆరంభం’. కీడా కోలా ఫేమ్ రవీంద్ర విజయ్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి (Abhishek) నిర్మించగా అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మే 10న విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కథ జైలు బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది. కాలాఘటి జైలులో ఒక మర్డర్ కేసు మీదా రెండున్నరేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తుంటాడు మిగిల్(మోహన్ భగత్). అయితే అతడికి కోర్ట్ మరణశిక్ష విధిస్తుంది. రేపు ఉదయం అతన్ని ఉరి తీస్తారు అనగా జైలు నుంచి మాయమవుతాడు మిగిల్. అతడు ఉన్న సెల్కి తాళాలు వేసినట్టే ఉంటాయి. ఎక్కడ గోడలు పగిలినట్లు కానీ.. తాళం పగిలినట్లు కానీ ఆనవాళ్లు కనిపించవు. ఇక అతడు ఎలా తప్పించుకున్నాడు అనేది తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సస్పెన్స్ను చేధించడానికి డిటెక్టివ్ (రవీంద్రవిజయ్) రంగంలోకి దిగుతారు. అసలు మిగిల్ అంత భద్రత ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అతనికి ఎవరైనా సాయం చేశారా? నాలుగు గోడల మధ్య నుంచి ఎలా మాయమయ్యాడు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఖైది నం.299 జైల్లో నుండి ఎలా తప్పించుకున్నాడు?
Watch #Aarambham pic.twitter.com/AdiZfauoEB— ETV Win (@etvwin) May 24, 2024