Aaradugula Bullet | ఏడేళ్లుగా ఒక్క హిట్ కూడా లేని గోపీచంద్.. తాజాగా సీటీమార్ సినిమాతో రచ్చ చేస్తున్నాడు. మాస్ సినిమాకు ఉన్న పవర్ ఏంటో ఈ చిత్రం చూపిస్తుంది. సంపత్ నంది తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ సినిమానే అయినా కూడా కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది సీటీమార్. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ కూడా రిలీజ్కు రెడీ అయిపోతుంది. ఈ సినిమాను అక్టోబర్లోనే విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ సినిమా వచ్చి ఈ పాటికే నాలుగు సంవత్సరాలు అయ్యుండేది. కానీ ఏం చేస్తాం.. కుదర్లేదంతే. నాలుగేళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఆ తర్వాత పూర్తిగా సినిమా విషయమే మరిచిపోయారు దర్శక నిర్మాతలు.
ఆరడుగుల బుల్లెట్ సినిమాను భారీ క్యాస్టింగ్, భారీ బడ్జెట్తో నిర్మించాడు తాండ్ర రమేష్. ప్రకాశ్ రాజ్, నయనతార, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్ వంటి నటులు ఈ సినిమా నటించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించాడు. నాలుగేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన ఈ సినిమాకు ఈ సినిమాను దాదాపు 18 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికీ ఈ చిత్రానికి ఇంకా బకాయిలు ఉన్నాయి. సినిమా విడుదలైన తర్వాత సెటిల్ చేస్తానని నిర్మాత చెప్పినా ఫైనాన్షియర్లు వినడం లేదు. పక్కాగా డబ్బులు కట్టిన తర్వాత గానీ సినిమా విడుదల కానివ్వమంటున్నారు. దాంతో చేసేదేం లేక కామ్గా ఉండిపోయాడు నిర్మాత. అయితే ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ హిట్ కావడంతో అరడుగుల బుల్లెట్ సినిమాను విడుదల చేసేందుకు మరోసారి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
గోపీచంద్కు యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ ఉండటం.. నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాను డిజిటల్ సంస్థలు మంచి రేటుకే తీసుకునేందుకు సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.15 కోట్లకు డీల్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ సంస్థ రూ.8 కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో వాళ్లు కూడా అరడగుల బుల్లెట్ సినిమా ఓటీటీ రిలీజ్కు అడ్డుతగులుతున్నట్లు సమాచారం. తమతో డీల్ అయిపోయాక ఇప్పుడు ఎక్కువ రేట్ వచ్చిందని వేరేవాళ్లకు ఎలా రైట్స్ అమ్ముతారని వాళ్లు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాగైనా అన్ని సమస్యలను క్లియర్ చేసి అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. థియేట్రికల్ రిలీజ్ అంటే ఓటీటీకి ఎక్కువ రేటు వస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలే ఈ ట్రిక్ ప్లే చేస్తున్నారని ట్రేడ్ పండితుల మాట. ఏదేమైనా కూడా ఈ బుల్లెట్ దిగితే చూద్దామని గోపీచంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
గోపీచంద్ సీటీమార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తొలిరోజు కూత అదిరింది..