భీమగాని సుధాకర్గౌడ్ స్వీయ రచనాదర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపద్భాంధవుడు’. పెంచల్రెడ్డి, డి.లీలావతి నిర్మాతలు. పెంచల్రెడ్డి, సుధాకర్గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రధారులు. వచ్చే నెల 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ప్రెస్మీట్ను నిర్వహించారు.
‘వ్యాపారం, కుటుంబం, సమాజసేవ.. ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ సేవారత్నగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన పెంచల్రెడ్డి. ఆయన కథ ఆధారంగా ‘ఆపద్భాంధవుడు’ చిత్రాన్ని రూపొందించాను. సమాజంలో చైతన్యాన్ని రగిలించే చిత్రమిది.’
అని దర్శకుడు భీమగాని సుధాకర్గౌడ్ చెప్పారు. ఇంకా పెంచల్రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, నిర్మాణం: శ్రీలక్ష్మీ ఎడ్యూకేషనల్ ఛారిటబుల్ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్స్.