Adipurush | ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఓం రావత్ దర్శకుడు. కృతి సనన్ నాయికగా నటిస్తున్నది. రామాయణ ఇతిహాస నేపథ్యంతో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఓం రావత్ తెరపైకి వచ్చే తేదీని ఆగస్టు 11గా ఖరారు చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్ మారింది.
ఆమీర్ ఖాన్, నాగచైతన్య నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ( Laal singh Chaddha ) సినిమా విడుదల తేదీని మార్చడంతో ఆ ప్రభావం ఆదిపురుష్పై పడింది. లాల్ సింగ్ చద్ధా సినిమా నిజానికి ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా చిత్రీకరణ సకాలంలో జరగకపోవడంతో అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించింది. ఆదిపురుష్ ముందే రిజర్వ్ చేసుకున్న ఆగస్టు 11న లాల్ సింగ్ చద్ధా సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపింది. ఆదిపురుష్ చిత్ర బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ డేట్ను ఫిక్స్ చేసుకున్నట్లు పేర్కొంది. లాల్ సింగ్ చద్ధా వస్తుంది అంటే.. ఆ రోజున ప్రభాస్ ఆదిపురుష్ సినిమా వాయిదా పడినట్లు అర్థమవుతోంది. అంతేకాదు తమకు దారి ఇచ్చినందుకు లాల్ సింగ్ చద్దా చిత్ర బృందం ఆదిపురుష్ సినిమా టీమ్ కు కృతజ్ఞతలు కూడా తెలిపింది.
#LaalSinghChaddha @Viacom18Studios @TSeries pic.twitter.com/dZBVkNiIyc
— Aamir Khan Productions (@AKPPL_Official) February 15, 2022
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ చాలా దెబ్బతింది. చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. నెలల తరబడి చిత్ర నిర్మాణాలు నిలిచిపోయాయి. అలా షెడ్యూల్స్ అన్నీ వాయిదాలు పడుతూ వచ్చాయి. ఇది విడుదల తేదీలపైనా ప్రభావం చూపిస్తోంది. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్టులు ఉన్న ఆదిపురుష్ లాంటి చిత్రాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.