అరుణ్ విజయ్, పల్లక్ లల్వానీ జంటగా నటించిన తమిళ చిత్రం ‘సినం’ తెలుగులోకి ‘ఆక్రోశం’ పేరుతో రాబోతున్నది. ఈ చిత్రాన్ని సీహెచ్ సతీష్ కుమార్తో కలిసి శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్, మూవీ స్లయిడర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
జీఎస్ కుమార వేలన్ దర్శకుడు. ఆర్ విజయ్ కుమార్ నిర్మాత. ఈ నెల 16న సినిమా విడుదలవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ…‘యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. రివెంజ్ డ్రామా కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సమాజానికి చెప్పాల్సిన కొన్ని మంచి పాయింట్స్ ఈ కథలో ఉన్నాయి’ అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ…మంచి సందేశంతో పాటు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అన్నారు.