ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అగ్ర హీరోలు నటించిన భారీ చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై 50 రూపాయలు పెంచింది. మొదటి మూడు రోజులు మాత్రమే టికెట్ పెంపునకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో పాటు ఆరో ఆటకు కూడా అనుమతినిచ్చింది. ఉదయం నాలుగు గంటల నుంచి షోలను ప్రదర్శించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో టికెట్పై 50 రూపాయలు పెంచుతున్నట్లు పేర్కొంది.