ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ (Aadipurush). మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. సీతారాముల పక్కనే లక్ష్మణుడు, వారి ఆశీస్సులు తీసుకుంటున్న హనుమంతుడి లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్.. అంటూ విడుదల చేసిన తాజా లుక్ అందరినీ ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఓం రౌత్ రామాయణానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సిల్వర్ స్క్రీన్పై మరింత కలర్ఫుల్గా చూపించబోతున్నట్టు తాజా లుక్తో అర్థమవుతోంది. ఈ మూవీని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.ఆదిపురుష్లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి (లంకేశ్)గా నటిస్తున్నాడు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తుండగా.. హనుమంతుడి పాత్రలో దేవ్దత్తా నగే నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాచెట్-పరంపర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ను ఇప్పటికే విడుదల చేయగా.. మిక్స్ డ్ రెస్పాన్ వచ్చింది.
ఆదిపురుష్ కొత్త లుక్..
Mantron se badhke tera naam
Jai Shri Ramमंत्रों से बढ़के तेरा नाम
जय श्री रामమంత్రం కన్నా గొప్పది నీ నామం
జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage pic.twitter.com/yjUXLb06RJ— T-Series (@TSeries) March 30, 2023