ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కెకె రాధామోహన్ నిర్మాత. లక్ష్మీ రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ నాయికలు. కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. పేరుకు తగినట్లే సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని చెబుతున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం : ఆర్ఆర్ ధృవన్, సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, ఎడిటర్ : జి సత్య, యాక్షన్ : రామకృష్ణ.