ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్ కథానాయికలు. సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు. ‘ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నేటి యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి. పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, రచన-దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి.