ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్లో శుక్రవారం హీరో ఆది పినిశెట్టి పాల్గొన్నారు. నటుడు శత్రు నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన రామోజీ ఫిలింసిటీలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమమిదని అన్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఎంపీ సంతోష్కుమార్ అద్భుతంగా గ్రీన్ ఇండియాచాలెంజ్ను ముందుకు తీసుకెళ్తున్నారని ఆది కొనియాడారు.