Aadavallu meeku johaarlu pre-release business | యువ హీరో శర్వానంద్ను కొన్నేండ్లుగా వరుసగా ఫ్లాప్లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. దీంతో తన కెరీర్కు బూస్ట్ ఇచ్చే ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో వస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. నేను శైలజ, చిత్రలహరి చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకున్న కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి 16 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది ఆయన గత చిత్రాల కంటే తక్కువే. శర్వానంద్ గత చిత్రాలు మహాసముద్రం, శ్రీకారం చిత్రాలు వరుసగా 16.7 కోట్లు, 17.1 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్లు జరిగాయి. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే 16.5 కోట్ల షేర్ను సాధించాలి. అది కూడా ఏడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చేవారం రాధే శ్యామ్ సినిమా విడుదల కానుంది. ఒక వేళ ఆ సినిమా వస్తే శర్వా సినిమాకు కలెక్షన్లు రావడం కష్టతరం అవుతుంది.