సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలలో దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అవినీతి రాజకీయాలు వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నాయనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించారు సాయితేజ్. ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ కేవలం 64 రోజులలో పూర్తైందని తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేసి స్పష్టం చేశారు మేకర్స్. టఫ్ లొకేషన్లో, వాతావరణం అనుకూలించని ప్రాంతంలో షూటింగ్ చేసినట్టు తెలియజేశారు.తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. కాగా, సెప్టెంబర్ 10న జరిగిన రోడ్డు ప్రమాదం వలన తేజూ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాడు.