ప్రముఖ తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ తమిళంలో నిర్మించిన తొలిచిత్రం ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకుడు. పూ రామన్, కాళీ వెంకట్ నటించిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇప్ఫీ)లో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమాలో ప్రదర్శించిన ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి. తాత, మనవడు, మేక చుట్టు తిరగే ఈ కథలో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ చిత్రానికి ఇలాంటి గౌరవం లభించడం పట్ల నిర్మాత స్రవంతి రవికిషోర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.