మంచు మనోజ్ కథానాయకుడిగా నటించనున్న ఓ నూతన చిత్రం త్వరలోనే సెట్స్మీదకు వెళ్లనుంది. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర వివరాలను వెల్లడించారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎల్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.శ్రీనివాసులు, డి.వేణుగోపాల్, ఎం.మమత, ముల్లపూడి రాజేశ్వరి నిర్మించనున్నారు.
మంచు మనోజ్ కెరీర్లో ఎంతో వైవిధ్యమైన చిత్రమిదని ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి మమత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.