పృథ్వీరాజ్, అనూ మోహత జంటగా పీఎస్ఆర్ ప్రొడక్షన్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రవీణ శివరాజ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దోపిడీ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే టైటిల్ ప్రకటించి ఫస్ట్లుక్ విడుదల చేస్తాం. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పరశురామ్, దర్శకత్వం: పి.మణిరాజ్.