80వ దశకంలో దక్షిణాదితో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్స్గా వెలిగిన తారలు ఏడాదికోసారి ఒకచోట కలుస్తుంటారు. ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్గా దీనికి పేరుంది. గత రీయూనియన్ చిరంజీవి ఇంటిలో జరగగా…ఈసారి బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఈ సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ముంబైలోని జాకీష్రాఫ్ ఇంటిలో 80వ దశకపు తారలంతా కలిసి ఆటపాటలతో గడిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, వెంకటేష్, భానుచందర్, నరేష్, అర్జున్, శరత్ కుమార్, భాగ్యరాజ్, అనుపమ్ ఖేర్, రాధ, సుహాసినీ, విద్యా బాలన్, శోభన, లిజీ, సుమలత తదితరులు పాల్గొని అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.