ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15వ తేదీన మొదలుపెట్టింది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది.
మరోవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం 40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సెట్ని సాంగ్తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం వాడనున్నారని టాక్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందనున్న సాంగ్లో అమెరికా .. రష్యా .. ఉక్రెయిన్ .. బ్రెజిల్ .. ఆఫ్రికా .. యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు పాల్గొననున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారట.
పది రోజుల పాటు ఆ లొకేషన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా శంకర్ ఈ సాంగ్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.