“మల్లేశం’ చిత్రంతో నా కెరీర్కు కొత్త ఊపిరినిచ్చారు దర్శకుడు రాజ్. ఆ కృతజ్ఞతతోనే ఈ వేడుకకు వచ్చాను. ‘23’ చాలా గొప్ప కథ. ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్ని అడగడం చాలా అవసరం. అది ఈ సినిమా ద్వారా సాధ్యమైంది’ అన్నారు ప్రియదర్శి. మంగళవారం జరిగిన ‘23’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ప్రియదర్శి, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ నెల 16న ‘23’ విడుదలకానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబోస్..సృజనాత్మకతకు పెద్దపీట వేసే దర్శకుడు రాజ్ అని కొనియాడారు. థియేటర్లోనే చూడాల్సిన చిత్రమిదని, యథార్ధ సంఘటనల స్ఫూర్తితో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.