సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోషన్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ 7డేస్ 6నైట్స్’. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. రజనీకాంత్తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ..‘సినిమాలోని వినోదాన్ని, భావోద్వేగాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. సినిమా బాగుందనే టాక్ పెరుగుతున్నది. యువతకు సినిమా బాగా నచ్చుతోంది. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం సబబే. కానీ చిన్న చిత్రాలకు టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఓటీటీలో చూద్దాలేం అనుకునే సినిమాల కోసం కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రోషన్, సుమంత్ అశ్విన్, నాయికలు కృతికా శెట్టి, మెహర్ చాహల్ తదితరులు పాల్గొన్నారు.