హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరరీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్బాగ్కు చెందిన హకీం సుఫీ షా కైరుద్దీన్పై సయీద్ లాయక్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. కైరుద్దీన్ సోషల్ మీడియా వేదికల ద్వారా సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తూ వీడియోలు పోస్టు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనుసరించి పోలీసులు కైరుద్దీన్పై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు.