హైదరాబాద్: 96వ ఆకాడమీ అవార్డ్స్(Oscars) రేసు నుంచి 2018 చిత్రం ఔటైంది. మలయాళ చిత్రం 2018.. ఎవరివన్ ఈజ్ ఏ హీరో .. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి జూడే ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. 2024లో జరగనున్న ఆస్కార్ అవార్డులకు చెందిన షార్ట్లిస్టును అకాడమీ ప్రకటించింది. 10 క్యాటగిరీల్లో లిస్టును రిలీజ్ చేశారు. అయితే షార్ట్లిస్ట్లో 2018 ఫిల్మ్కు చోటు దక్కలేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, డాక్యుమెంటరీ ఫీచర్, ఇంటర్నేషనల్ ఫీచర్, ఒరిజినల్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ క్యాటగిరీల్లో షార్ట్లిస్టును ప్రజెంట్ చేశారు.
జార్ఖండ్ గ్యాంగ్రేప్ ఆధారంగా తీసిన ‘టు కిల్ ఎ టైగర్’ అనే డాక్యుమెంటరీ .. బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరీలో షార్ట్లిస్ట్ అయ్యింది. టొరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా దీన్ని డైరెక్ట్ చేశాడు.