సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. కుటుంబ బాధ్యతల కారణంగా రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్లు గతేడాది అక్టోబర్లో ప్రకటించాడు. అనేక సందర్భాల్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన మరోసారి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు.
ఈ మేరకు రాజకీయాల్లోకి రానున్నట్లు వరస ట్వీట్లలో పేర్కొన్నారు. ముందుగా ‘నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా’ అని ట్వీట్ చేశాడు. ఆ తరువాత కాసేపటికే ‘నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తానని’ రాజకీయాల్లోకి తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ‘రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి అందుకే వస్తున్నా’ అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే ఏ పార్టీలో చేరనున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు.
బండ్ల గణేష్ అనేక హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించాడు. ఆయన చివరగా డేగల బాజ్జీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023
రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥
— BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023